RSS

ఈ పెద్ద నగరంలో సేద తీరడానికి ఎన్ని చెట్లున్నాయో ?

ఈ పెద్ద నగరంలో సేద తీరడానికి ఎన్ని చెట్లున్నాయో ? . ఆ లెక్క నాకు తెలియదు . కానీ ఓ కవుల చెట్టు గురించి కాసింత ముచ్చటించాలి. మొన్నటి వరకు కవిత్వం రాసే లక్షణాలుండి తన చెంత చేరిన ఏ యువకుడైనా కవి కావడానికి ఆ చెట్టు ఓపిగ్గా మెరుగులు దిద్దుతూ ప్రోత్సహించేది . కవులకు , కవిత్వ శ్రోతలకూ ఆధారమైన వేదికగా మారేది . ఇట్లా యాభై ఏళ్ళు అట్లాంటి పని చేసింది . ఇప్పుడు ఆ చెట్టు పండు మక్కింది .

నేను చెబుతున్న ఆ కవుల చెట్టు పేరు సి.వి.కృష్ణారావు . ఆయన ఇప్పుడు 90 ఏళ్లకు దగ్గరలో ఉన్నారు . కవి ం.శ్. నాయుడు, నేనూ నిన్న వెళ్లేసరికి భూతద్దం సహాయంతో ఆలూరి భైరాగి పుస్తకం "నూతిలో గొంతుకలు" పడుకుని చదువుతున్నారు. ఆదివారం కాబట్టి ఇంటి పక్క చెర్చీ నుండి వస్తున్న ప్రార్థనలను "ఎర్ర క్రీస్తు " రాసిన భైరాగికి కూడా వినిపిస్తున్నారేమో ? ఎవరైనా ఆయనను చూడడానికి వెళితే మనం ఈ దృశ్యాలను చూడొచ్చు : కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా తాపత్రయపడుతూ పుస్తకం చదువుతుండోచ్చు . లేదా పుస్తకానికి అట్టలు వేసుకుంటూ ఉండొచ్చు . వేసిన అట్ట మీద రంగు రంగుల స్కెచెస్ తో ఆ పుస్తకం పేరు రాసుకుంటారు .

అవసరమైతే దానిలో నచ్చిన నోట్స్ పక్కనే రాసుకుంటారు. తన గది కిటికోలోంచి పడుతున్న వెలుగుతో ముచ్చటిస్తుంటారు. పుస్తకాల మీద ఉన్న డస్ట్ ని తూడుస్తుంటారు . విరిగిన కూర్చీకి నవారా చుడుతుంటారు . ఏవైనా కవి పక్షులు వచ్చి తన మీద కాసేపు వాలి పాడుతాయేమోనని ఎదురు చూస్తుంటారు . చెవులు సరిగ్గా వినపడకపోయినా చిన్నా పెద్దా లేకుండా తెలిసిన మిత్రులకు ఫోన్ చేస్తుంటారు . ఎదుటి వారు ఏమి చెబుతున్నారో అర్థంకాకున్నా సమాదానాలను తానే ఊహించుకుని సంబరపడిపోతారు . ఈమేల్స్ , ఫేస్బుక్ కాలంలో కూడా చేతు సరిగ్గా సహకరించక పోయినా పోస్ట్ కార్డ్ ఉత్తరాలు రాస్తుంటారు . గంగిరెద్దు వాళ్ళు పాట పాడుతూ ఇల్లు దాటిపోతుంటే ఇంతకుముందులాగా ఇచ్చినట్లుగా పాత అంగీలు , కొన్ని పైసలు ఇప్పుడు ఇవ్వలేకపోవడానికి శరీరం సహకరించలేకపోతుందే అని ఫీల్ అవుతారు .

మనం అయన దగ్గరికి వెళ్లామే అనుకోండి ఇవి అనుభవిన్చోచ్చు: లేవడం చాతకాకున్నా లేచి రిసీవ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారు . 360 డిగ్రీల కోణంలో తన నవ్వుని మనస్పూర్తిగా నవ్వి మన మనసుకు సుగంధాల్ని పూస్తారు . మనం అడవిలో ఏ యోగి దగ్గరో వున్నామోనన్న ఫీల్ అప్రయత్నంగా కలిగిస్తారు . మనం మాట్లాడేది మన పెదవుల కదలికను బట్టి పసిగట్టడానికి ప్రయత్నిస్తారు లేదా పేపర్ పెన్ను ఇచ్చి రాయమంటారు . మిగితా మిత్రులు ఎలా వున్నారోనని వాకబ్ చేస్తారు . ఇంతకుముందు లాగే ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడని , ఇదిగో మన X వచ్చాడు , మన Y వచ్చాడు వారికి కాఫీ తీసుకరా ! అని అనబోతారు . కానీ ఇప్పుడు ఆవిడకి కూడా లేవలేని అనారోగ్యం కాబట్టి పిల్లలను పిలుస్తారు . ఆవిడకు కూడా 80 ఏళ్ళు పైనే . వారి గది నిండా వెదికితే ఏముంటాయి ? రెండు చిన్న పాత మంచాలు. రేకు పైన కనిపించే ఆ ఇద్దరివి నాలగైదు జతల బట్టలు, రెండు కూర్చీలు, కొన్ని పుస్తకాలు . ఎంత సౌకర్యంగా వున్నారంటే వారి గదిలోకి ఇంకేం వచ్చినా ఇరుకు ఫీల్ అవుతారేమో . మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పకనే చెబుతున్నట్లుగా అనిపించింది .

ఈయన ఎంతో కొంత మాట్లాడలనుకుంటారు కానీ వినపడదు. ఆమెకు వినపడుతుంది కానీ ఎక్కువగా మాట్లాడలేదు. అలా నిశ్శబ్దాన్ని తాగుతున్నారు . అద్భుతమైన ముని జంట . వాళ్ళ గది నిండా తెల్లటి కాంతి . వాళ్ళ గది నిండా కనిపించని గాయకుడు పలుకుతున్న సన్నటి రాగం . ఎంత జీవితం చూసారో . ఎన్ని చేసారో . నిండుగా ఉన్నారు . ఆయనని ఓ తెల్లటి, పలుచటి ముడుతల చర్మం దుప్పటి కప్పినట్లు కనిపిస్తుంటుంది. తన చేతులతో మనల్ని దగ్గరకు తీసుకుని చేతులు తడిమి తన చల్లదనాన్ని ప్రసారం చేస్తారు.

ఒకప్పుడు ఆయన గిరిజన శాఖలో ఆయన ఉన్నతాధికారి గా పనిచేసారు . రాష్ట్రమంతటా ఆయన తిరుగని గిరిజన గూడెం లేదని , అలా అంతగా తిరిగిన వారు ఇంకెవరూ లేరని ఆ శాఖలో పనిచేస్తున్నఅధికారి , కవి వాడ్రేవు చినవీరభద్రుడు గారు అప్పుడప్పుడు అంటుంటారు . ఏ తరగతి మనష్యులనైనా ఆత్మీయంగా హత్తుకుంటారు ఆయన . అందుకే కృష్ణారావు గారు అంతటి ప్రజల మనిషి కాబట్టే ప్రజా IAS ( రిటైర్డ్ ) అధికారులైన S.R.Shankaran , K.R Venugopal , Kaki Madava Rao గార్లకు ఇష్టుడైన అధికారిగా అయ్యారటా. సర్వీస్ అయిపోయిన ఎన్నో ఏళ్ల తరువాత కూడా మొన్న అంతే ఇష్టంతో K.R Venugopal గారు పొత్తూరి వెంకటేశ్వర్ రావు గారిని వెంటేసుకుని ఆయన ఇల్లు వెతికి వెతికి కేవలం చూసిపోడానికే కలిసారటా .


సహజంగానే ఆయన కవి . వైతరణి నుండి కిల్లారి వరకు కొన్ని కవిత్వ పుస్తకాలు రాసారు . ఓవుత్సాహికులైన కవులకు , లేదా లబ్ధప్రతిష్టులైన కవులకు ఆయన ఇల్లు ఎప్పుడూ ఓ వేదిక . దాదాపు 600 పైన కవి పక్షులు ఎదో ఒక సమయంలో ఆ నెలనెలా వెన్నెలలో రస విహారం చేసాయి. ప్రతి నెలా చివరాకరి ఆదివారం నెలనెలా వెన్నెల పేరుతొ దాదాపు 50 ఏళ్ళు దాన్ని నడిపారు . ఉద్యోగరీత్యా ఆయన కాకినాడ వెళ్ళినా , వరంగల్ వెళ్ళినా , హైదరాబాద్ వచ్చినా ఎక్కడా దీన్ని ఆపలేదు . కాలోజి , కుందుర్తి లాంటి తొలితరం వచన కవులు , అప్పటి కొంత మంది దిగంబరకవులు , కొంత మంది విప్లవ కవులు, ఇంకా రకరకాల వాదాలను వినిపించే కవుల వరకూ ; నేడు సీనియర్ కవులు అని పిలవబడుతున్న వారి వరకూ ; సిరివెన్నల సీతారామశాస్త్రి, అందెశ్రీ లాంటి పాట కవులతో సహా ం.శ్. నాయుడు , విజయ్ కుమార్ లాంటి యువ కవుల వరకు ఏదోరకంగా ఆ చెట్టు మీద సేద తీరినవారే . ఆ కవిసంగమంలో ఈదినవారే . వారి నెలనెలా వెన్నెల్లో ప్రపంచ సాహిత్యం ప్రవహించడం నేను కూడా చూసా .

ఆయన సమాజసేవ , సమాజమార్పు అనే పెద్ద పెద్ద పెద్ద పదాలు వాడలేదు . కావాలని సందేశాలూ ఇవ్వలేదు . కానీ తానున్నమేర వూడ్చుకుంటూ హృదయమున్న మనిషిలా బతికారు . అందుకేనేమో 80 ల్లో అనుకుంటా ఆయన వరంగల్ జిల్లా ఏటూర్ నాగారం ఏరియా అడవుల్లో గిరిజన అధికారిగా పని చేస్తున్నపుడు ప్రభుత్వ వాహనంలో ప్రయాణం చేస్తున్నారటా. కొంత దూరంలో మాటు వేసిన ఆ ఏరియా నక్సలైట్ ముఖ్య నాయకుడు తన దళసభ్యులతో వస్తున్న ఆ ప్రభుత్వ వాహనంలో కృష్ణారావ్ గారు ఉంటే పేల్చకండి వేరే ఎవరున్నా ఆ వాహనాన్ని మాత్రం పేల్చండి అన్నారటా . వచ్చిన వారు కృష్ణారావ్ గారిని చూసి పేల్చకుండా వెనుతిరిగారటా . ఇంతకంటే చెప్పేదేముంటుంది .

ఇప్పుడు ఆ చెట్టు హైదరాబాద్ లోని చైతన్యపురిలో తన గదిలో పండు మక్కిన పసుపు పచ్చ జామ పండులా , హాయిగా ఏవో నేమరువేసుకుంటుంది . తనకు పరిచయం ఉన్న ఆ పాత పక్షులోచ్చి తన మీద కాసేపు వాలిపోతే నవ్వుతూ ఇంకా పచ్చగా మెరిసిపోతుంది . కలసినవారి ముఖంలో వెలుగు నింపుతుంది .
( Note : Sorry pics are blurred . Photos taken without preparation . We used very ordinary cheap cell phone to take these pics. )

Courtesy : Ganga Reddy A


5 కామెంట్‌లు

గాంధారి వారసులం


ప్రతిమనిషి ఎదుటిమనిషికి అద్దమే,

చూడచ్చు తమనితాము ఎదుటివాడి కళ్ళలో ,
చూడచ్చు తమ నడవడి పరిణామం సాటివానిపురోగామంలో ,
తాను యోజనాలు ప్రయాణం చేసాడు ,
తన గమనంలో కదలికలు లెక్కిస్తూ ,
తన నొసల్లు సంధించిన ధనస్సులు,
నేత్రాలు అస్త్రాలై నడిచే అమ్ములు,
పెదిమల చిరునవ్వుల లాస్యాలు ,
అవని సంధించిన శరత్తు ,
కరచాలనంలో విరిసిన స్నేహం,ఆశీస్సులు కురిపించే అమృతహస్తం ,
సాటి మనిషి ఉన్నతిని సహించలేని అసహనంతో ,
అంతా అవినీతి పరులనే అపనమ్మకంతో,
అర్ధంలేని నిస్సతువతో ,
అందుకోలేని అందలాలకోసం అంగలారుస్తూ
మనం చేయగలిగిన పనులుకూడా చెయ్యకుండా ,
ఎదుటివాడిని మాటల వలలో ఇరికిస్తూ, కస్ట్టపడుతున్నవాల్లని చులకన చేస్తూ,
బ్రతుకుని సూంబేరితనంతో గడుపుతున్నవారిని ,
చూడలేక,చూడక తప్పక,
స్వార్ధం చాటున మాయమైన హస్తాన్ని వెతుక్కుంటూ,
ఎదుటివాడి చూపుతో తన నడవడి దిద్దుకోలేక,
కేవలం సహృదయంతో సమస్యలు పరిష్కారం కావని తెలిసి,
మేధావి అయినా ,,మానవతావాది అయినాతప్పలేదు గాంధారికి గంతలు!!!
మర్మమెరిగిన మనమూ కావాలనే కట్టుకున్నాము గంతలు ,
మాన,ప్రాణ ,దహనాలాకు ,ఆవర్తులైన చీకటి గూళ్ళు ఈ రెండు కళ్ళు..!
ఎందరో గాంధరులు

0 కామెంట్‌లు

పౌర్ణమి పరిష్వంగం

......................జాన్ హైడ్ కనుమూరి 

~*~

ఏ నాటి కథో

చవితినాడు చంద్రుణ్ణి చూస్తే...
నీలాపనిందలని 

నేనొక రాగిపాత్రనై
బాద్రపద చతుర్థి వెన్నెల్లో పడి
పొర్లాడిన వేళ 

పాదమేదో తాకింది
అస్థిత్వం లేని నా దేహాన్ని
ఏ స్వాతి చినుకో గొంతుదిగింది
ఏ సిట్రిక్ యాసిడ్డో పడింది
కిలాన్ని కడిగి మిలమిలా మెరుపొచ్చింది
వేలికొనలేవో లీలగా ఆపాదమస్తకం తడిమాయి 

అల్లావుద్దీన్ దీపంగా మారింది
కళ్ళమారబోసిన వెన్నెలయ్యింది
వెల్లువై పరిమళం విరిసింది

ఆ వెన్నెల్లో  పాదచారినై
వన్నె త్రాచునై
నెలనెలా వెన్నెల పరిష్వంగంకోసం
పాదముద్రలు వెతుక్కుంటూ... వెతుక్కుంటూ 

నెలవంకను స్పృసించిన
రవి వీక్షన కిరణాలు
ఆశ్ మాన్ కొండదారిపై
వెండిలా మెరుస్తూ
కకూ నా కలానికీవారథి వెన్నెల
కలాన్ని హలంగా
బీళ్ళను గాళ్ళను దున్నుతూ
వాటంగా మోటరువేసి
నరనరాన్ని నీరు నింపుతోంది

వెదజల్లిన బీజాలు
అంకురాలుగా కంకులుగా
లయ తూగుతుంటే
హరిత పవన లాస్యం మదినంతా నిండింది.
___________ 

మొదటి సారి నెలానెలా వెన్నెల (వినయకచవితి 2003)నాటి నుంచి కొన్ని జ్ఞాపకాలు
0 కామెంట్‌లు

అమ్మ ఆవేదన - ParvathiMohan


 


నా కొంగు పట్టుకుని ,చుట్లు తిరిగిన రోజుల్లో,
అమ్మే అంతా అనుకున్నావు,ఇల్లే ప్రపంచం అనుకున్నావు.
అంత దూరాన నీవోక్కదివే చలికి దుప్పటి కప్పమని ,
నిద్రకు జో కొట్టమని,ఎవరినడుగుతావు?
ఇంటి గోడలు దూకి రోడ్డున పడ్డావని,
ఎడమ కుడి దారుల్లో ఇరుక్కుపోయావని,
నీవు దూరంగా వెళ్ళిన బాధ,
నీ నడతకు మమతలు పూసిన గాధ!
నీ సన్నిహితుడు స్నేహితుడా?హితుడా?
అన్న వివేచనా చెయ్యి,
నీవేసిన ప్రతి అడుగూ ప్రచన్నంగా కాపాడుకో,
మనిషిని మనిషినించి దూరం చేస్తుంది డబ్బు ,
నీది కాని దానిమీద ప్రణాలికలు పెంచద్దు,
నీకు కావాల్సింది సంపాదించుకో నీవే,
ఒకరి దయా భిక్షాల మీద ఒరగానీకు మనసు,
కరుకుగా వున్నా,నే రాసిన అక్షరాలూ మనసుమీద మలచుకో,
మనసులోని మమతకు మారుపేరు మాట,
మది గుచుకున్న ముళ్ళు నిడివి,,
ఎదకు తగిలిన గాయపు వైశాల్యం,
అది కత్తికి,కాదు కోత,గుండెకి!!
సమయా సమయ విచక్షణ లేక,
ఆలోచనలు,నోటితో,అనేయకు,
అడుగు వెనక్కు నడవకు,అన్న మాట కూడా ఆగిపోదు,మరి!!!
చీకటి లేక విలువ లేదు వెలుగుకి,
ఆవేదన లేక,అందం లేదు,ఆనందానికి,
మృత్యువు లేక మురిపెం లేదు జీవితానికి,
వ్రుదాప్యం లేక వింతే లేదు వయసుకి,
కన్నీరు తప్ప ఏదీ కడగలేదు కనుగుడ్లని,
పూల పరిమళాలు,పదిలంగా దాచుకో,
ముల్లునైన మలచుకో నీకనుగునంగా
నగరం నిగానిగాలతో,నిన్ను నుసి చేస్తుంది,
వ్యధ చెందిన నీ తల్లి ఉతరం,వృధా ప్రయాస కానీకు,
కన్నతల్లి మాటలు,దీపానికే వేలుగిస్తాయి,
నీ కలలో అవి వలయాలై,నిన్నే మెరిపిస్తాయి!!!!!
**************
తల్లి తండ్రులకి,దూరంగా వున్నా పిల్లలందరికీ,
కవిత అంకితం.

0 కామెంట్‌లు

పాపం--పిల్లనగ్రోవి

వెదురుకు తెలియదు తనలో చేరిన ఊపిరి ,

ప్రాణం పోసుకుని నాదమై వెలువడుతుందని,,,

జగన్నాటక రంగంలో పాత్ర ధారినావుతానని,

వూపిరున్నంత సేపే తానూ మురళినని,,

అది లేక తానుత్త ,,వేడురునేనని !!


పలికించిన కొన్ని నాదలతోనైన ,అనుభూతులెన్నో పొంది,,

మహాభాగ్యంగా పదిలంగా దాచుకుంటూ

మాయా మోహంలో పడి ముచ్చట పడుతూంది,,

పాపం మురళికి తెలియదు,,తానుత వెదురుబడ్డ నేనని,,!!


కేరుమన్న ఏడుపుతో, ఆడిన శ్వాస ,

గంభీర నిశబ్దాన్ని చేరేదాక,

తపనతో ఆగని ఆరాటం జీవితం!!

శీతల పవనాల కూర్వలేక ఉన్ని నాశ్రయించే కోమల దేహం,


మంచుముక్కలపై ఎట్లు పరున్దేనో,,

వేడి గాడ్పులకే వదలేటి దేహం,

చితి మంటల సేగాలనేట్లోర్చేనో,,

పరుల కలతలకే కన్నీరోలికే ఆర్ద్రత తన వారి శోకమేట్లోర్చేనో,,

విధి కదా వింత సృష్టిలో,

మృత్యువే కదా వరం జన్మలో!!

0 కామెంట్‌లు

నేరస్తుడు


అన్యాయమని మనసు అరుస్తున్నా,
పెగలలేని నోటికి ఎపుదోచిన్డీ మూగతనం ??
అన్నీ అందరికీ తెలిసినా అడుసులో పడుతున్న అడుగులకి,
ఎవరీచారీ చచుదనం??
ధర్మపన్నాలేన్ని తెలిసినా,
జీవన సూక్తులెన్ని చదివినా,
వినలేని, నీకేక్కదిడీ, చెవిటితనం,
అక్కున చేర్చుకు ఆడుకోవాల్సిన చేతులకి
 
ఆసిడ్లు చల్లి,అగ్ని రగిలించి,వలువలూడ్చి,వెటకారం చేసి ,
వికతాత్తహాసం చేసే చవట తనమేక్కడిది,?
సృష్టిలోని సమానత్వమెరిగి,
సమ సమాజ నిర్మాణం జరగాల్సిన చోట ,
మత కలహాల పేరిట ఈ మారణ కాన్దలేమిటి?
విష వలయాలు పన్ని,విజ్ఞానం,బుగ్గిచేసే ,
ఈ వికృత రూపుల విలయ తాన్దవమేమిటి,??
యత్ర నార్యంతు పూజ్యంతే అని,మొదలుపెట్టి ,
స్త్రీ ని వ్యాపారప్రకటనల వస్తువుగా మార్చి,
ఆసిడ్లతో,కత్తి,పోట్లతో,చిత్రవధ చేస్తుంటే
 
అవాక్కయ్యాడు దేవుడు?????
ప్రకృతిలోని,సుకుమరమంతా,రూపుదాల్చి,వచ్చిన స్త్రీని,
మనిషి,యంత్రం,కాకుండా కాపాడే మహా మంత్రమైన స్త్రీని,,
ఆటబొమ్మలా,పరిహసిస్తూ,
అబలలని,అనగాతోక్కుతున్న,పిశాచాలని చూసి,

ఇలా యంత్రంగా,పాశానంగా,
మారిన మనిషిని నేను సృష్టించలేదు,
ఈ మనిషి ముసుగేసుకున్న జంతువెవరూ,నాకు తెలియదని,
చెయ్యని నేరానికి పశ్చాతాప పడుతూ,
అవాక్కయిన అంతరంగంతో,
నేరస్తుడిలా తల వంచాడు దేవుడు!!!!!


.....................Parvathi Mohan 13.3.2010
1 కామెంట్‌లు

అమ్మ ఆవేదన - పార్వతి మోహన్




నా కొంగు పట్టుకుని ,చుట్లు తిరిగిన రోజుల్లో,

అమ్మే అంతా అనుకున్నావు,ఇల్లే ప్రపంచం అనుకున్నావు.
అంత దూరాన నీవోక్కదివే చలికి దుప్పటి కప్పమని ,
నిద్రకు జో కొట్టమని,ఎవరినడుగుతావు?
ఇంటి గోడలు దూకి రోడ్డున పడ్డావని,
ఎడమ కుడి దారుల్లో ఇరుక్కుపోయావని,
నీవు దూరంగా వెళ్ళిన బాధ,
నీ నడతకు మమతలు పూసిన గాధ!
నీ సన్నిహితుడు స్నేహితుడా?హితుడా?
అన్న వివేచనా చెయ్యి,
నీవేసిన ప్రతి అడుగూ ప్రచన్నంగా కాపాడుకో,
మనిషిని మనిషినించి దూరం చేస్తుంది డబ్బు ,
నీది కాని దానిమీద ప్రణాలికలు పెంచద్దు,
నీకు కావాల్సింది సంపాదించుకో నీవే,
ఒకరి దయా భిక్షాల మీద ఒరగానీకు మనసు,
కరుకుగా వున్నా,నే రాసిన అక్షరాలూ మనసుమీద మలచుకో,
మనసులోని మమతకు మారుపేరు మాట,
మది గుచుకున్న ముళ్ళు నిడివి,,
ఎదకు తగిలిన గాయపు వైశాల్యం,
అది కత్తికి,కాదు కోత,గుండెకి!!
సమయా సమయ విచక్షణ లేక,
ఆలోచనలు,నోటితో,అనేయకు,
అడుగు వెనక్కు నడవకు,అన్న మాట కూడా ఆగిపోదు,మరి!!!
చీకటి లేక విలువ లేదు వెలుగుకి,
ఆవేదన లేక,అందం లేదు,ఆనందానికి,
మృత్యువు లేక మురిపెం లేదు జీవితానికి,
వ్రుదాప్యం లేక వింతే లేదు వయసుకి,
కన్నీరు తప్ప ఏదీ కడగలేదు కనుగుడ్లని,
పూల పరిమళాలు,పదిలంగా దాచుకో,
ముల్లునైన మలచుకో నీకనుగునంగా
నగరం నిగానిగాలతో,నిన్ను నుసి చేస్తుంది,
వ్యధ చెందిన నీ తల్లి ఉతరం,వృధా ప్రయాస కానీకు,
కన్నతల్లి మాటలు,దీపానికే వేలుగిస్తాయి,
నీ కలలో అవి వలయాలై,నిన్నే మెరిపిస్తాయి!!!!!
**************
తల్లి తండ్రులకి,దూరంగా వున్నా పిల్లలందరికీ,
ఈ కవిత అంకితం.


SATURDAY, MARCH 13, 2010


0 కామెంట్‌లు

స్త్రీ జన్మ - గిరిజ నూకల



జన్మ కే జన్మ నిచ్చు స్త్రీజన్మ ధన్యము
గురువుకే తొలి గురువు నీకు అభినందనలు

దాసివై మగవాడిని మహరాజు చేసినా
మంత్రివై ఆ రాజు కు సూక్ష్మ ఙ్ఞానము నేర్పినా
వెల కట్టలేని ఆలి వై ఆనందాలు పంచినా
కడుపు లోని మానవ జాతిని మోసి జాతినే అమరం చేసినా
ఊయల ఊపి జగతినేలే నాయకులని పెంచినా
ఓర్పు,నేర్పు, సహన చాతుర్యాలతో అబలవైనా సబలవై లోకాలనేలినా
నీకు నువ్వే మేటి,లేదు నీ జన్మకు సాటి

మగవాడిలో సగమైనా ఆడదానిగా నీ స్రుష్టి అపూర్వము
జన్మ జన్మల వారది మానవజాతి సారధి
బరువైన బాధ్యలతో నీ జన్మ మానవాళికి నివాళి

కష్టాలు,కన్నీళ్ళు,వేధింపులు,సాధింపులు
కాకూడదు అవరోధము నీ జన్మ సార్ధకతకు
నిన్ను నువ్వు తెలుసుకొ,నీ విలువ పెంచుకో
తలబడి నిలబడి నీ జాతిని రక్షించుకో!

మహిళా దినోత్సవం సంధర్భంగా నాకు తోచిన నాలుగు మాటలు
0 కామెంట్‌లు

నీటిరంగుల చిత్రం ఆవిష్కరణ





నా కవితాసంపుటి 'నీటిరంగుల చిత్రం ' ఆవిష్కరణ ఈ నెల 28 వతేదీ సాయంకాలం 6 గంటలకి రవీంద్రభారతి మినీ కాన్ ఫరెన్సు హాల్లో. గత కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ లో రాస్తూ వచ్చిన కవితల సంపుటి. నా  మిత్రులందరికీ ఇదే నా ఆహ్వానం.

-----వాడ్రేవు చినవీరభద్రుడు, 
1 కామెంట్‌లు

రెప్పతెరిచేలోగా…



 
జాన్ హైడ్ కనుమూరి
మబ్బుకమ్మిన ఆకాశంలో ఎటో తప్పిపోయిన గాలిపటమై
గాలిపటం – చేతిలోని చరకాల మధ్య
తెగిన దారమైనప్పుడు
ఏది ఆత్మహత్య చేసుకున్నట్టు?
***
వినీలాకాశంలోకి
గాలిపటాలను రంగుల్లో ఎగురవేయడం
దారాలను మాంజాలుగా మార్చడం
తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని
కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం
***
రోషాన్నో పౌరుషాన్నో
కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
ఎగిరిపడ్డ కత్తివేటుకు
రక్తమోడిన నేల
విలవిలలాడే దేహాలమధ్య
వినోదమెవరిది? జూదమెవరిది?
***
అంతా ఎదురుగానే ఉంటుంది
సూర్యాస్తమయానికి వెలుగుపై చీకటికమ్మిట్టు
ఒక భ్రమ ఒకభ్రాంతి
వెలుగురేఖను కత్తిరిస్తుంది
రెప్పతెరిచేలోగా
ఒకదేహం జీవశ్చవమౌతుంది
ఒకదేహం కన్నీరుమున్నీరౌతుంది
***
ఆత్మను ఎవ్వరూ హత్యచేయలేరు
మెలిపెట్టీ  మెలిపెట్టీ
నొక్కేసేచేతులమధ్య స్వరాన్ని కోల్పోతుంది
ఇక శరీరం
తన్నుతాను హత్యకావించుకుంటుంది
గొంతును నులిమిన చెయ్యి కనబడకుండా
“ఆత్మహత్య”  అరుపులు కోలాహలమౌతాయి
***
చెమర్చిన కన్నేదీ
నిర్జీవదేహానికి జీవాన్నివ్వలేదు
***
ఎక్కడో
ఒక తీతువు గొంతును
ఒక రాబందు రెక్కలను సరిచేసుకుంటాయి
****
తెగిన గాలిపటం ఏ కొమ్మకో చిక్కుకుంటుంది
రక్తమోడ్చిన పందెపు పుంజు మషాలాలతో ఎవ్వరికో విందు చేస్తుంది
                                          ఇది ఆత్మహత్యేనా అని చెవులు కొరుక్కుంటూనే ఉంటాం         

Published :



1 కామెంట్‌లు

కొన్ని సమయాలు

కొన్ని సమయాలను కలిగివుండటం, కొందరిని దర్శించడం బాగుంటుంది
 
శ్రీ మునిపల్లె రాజు గారు
శ్రీ నందివాడ భీమారావు గారు
శ్రీ సి.వి. కృష్ణారావు - శ్రీమతి సీత గార్లను దర్శించారు 


0 కామెంట్‌లు

గోల్డ్ న్ ధెష్రోల్డ్ - కవిసంగమం కవిత్వం పండుగ



నిన్న గోల్డ్ న్ ధెష్రోల్డ్ లో కవిసంగమం కవిత్వం పండుగ జరిగింది.

ప్రముఖ కవులందరు కవిత్వంతో కవిత్వానికి జైహో అనిపించారు,  


అన్నిటికన్న ముఖ్యంగా నన్ను ఆకర్షించింది రైయిన్ బో హోం మేడి బావి చిన్నారులు,ప్రముఖ కవయిత్రి విమలగారి సలహతో పుస్తకాలు ఆవిష్కరిండం,కవితలు రాయడం బొమ్మలు వేయడం కవిత్వానికి ఇంతకన్నా పండుగ ఏముంది అనిపించింది, అచిన్నారులు శ్రద్ధగా ఓ పక్కగా కూర్చుని అందరికవిత్వం విన్నారు, వీళ్ళనుంచి నేర్చుకోవలసింది చాలా వుంది అనిపించింది,ప్రముఖ కవి శివారేడ్డిగారు అన్నట్లు ...అందరి దగ్గరనుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి జీవితంలో నేర్చుకోవడానికి ఏమి లేకపోతే ఖాళిగా మిగిపోతామేమో?
 

గుజరాత్ దగ్గరనుంచి భారతదేశంలో ఏమూల నుంచి కవిత్వాన్ని అర్దం చేసుకున్నా కవిత్వాని ఒకటే భాష మనసుపోరలలోనుంచీ మాట్లాడం, కవిని కలుసుకుని కవిత్వంతో మాట్లాడుకుందాం

 ప్రో.శీతాంషు యశశ్చంద్ర గారితోమాట్లాడినప్పుడు కూడా ఇలాగే అనిపించింది
 
భాషఏదైనా భావం ఒక్కటే కవిత్వం,కవిత్వం..

నేలమీద కాలు ఆనితేనే భూమితడి ,నేలపగుళ్ళు,తెలుస్తాయి గోరటివెంకన్న గారి దగ్గరనుంచి పల్లే మట్టి వాసనని అనుభవించిన నిన్నటి సాయంకాలం ఓ అద్భుతం పాటలు పల్లేని మోసుకొచ్చాయి ఎన్ని సార్లు విన్న కొత్తగా మళ్ళీ వినాలనిపించేఆపాటలకి
మళ్ళీ మరోసారి కవిత్వానికి జైహో....                


       
.రేణుక అయోల 

1 కామెంట్‌లు