RSS

నెలనెలా వెన్నెల 2వ కవితా సంకలనం



నెలనెలా వెన్నెల 2 కవితా సంకలనం నవంబరు 1990లో వెలువడింది.
అందులోనుంచి సి.వి.కృష్ణారావు గారి మాట

నెలనెలా ...
సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం ఆగష్టు రెండవ బుధవారు నాడు ఆప్యాయతగా కలుసుకొన్న అయిదుగురం నగ్నముని, పె.ఎన్‌.స్వామి, చంద్రశేఖర్‌, కలగా వెంకట సుబ్బారావు. నాటికి వీడ్కోలు చెప్పుకొనే వేళకు కవిత్వం గురించి ఒక్కరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించలేదు. కాని అదే మాదిరిగా ప్రతినెలా ఒకసారి కలుసుకుందామని నిర్నయించుకున్నారు.

నూరు నెలలూ క్రమం తప్పకుండా కలుసుకుంటూనే ఉన్నారు. మా అయిదుగురి నుంచి ప్రతినెలా తప్పనిసరిగా కలుసుకొనేవారి సంఖ్య 40 - 50కి పెరిగింది.

"నెలనెలా వెన్నెల" ఇప్పటికి ఇసుపరిచితమైన సాహిరతీ మైత్రీవేదికగా రూపొందింది. కవితా వ్యాసాంగంలో ఉన్న కొందరు మిత్రుల నెల కొకసారి కలుసుకొని ఒకరి రచనలు మరొకరికి వినిపించుకోవటానికి సమావేశాలు మంచి అవకాశం కలిగించాయి. ఉపనిషత్తులూ, ఉదాత్తభావాలూ, ఉద్రేకాలూ, విప్లవకవిత్వం, పద్యాలూ, వచనకవిత్వం, పాటలూ, ఒకే సమావేశంలో ఒకరిలొకరు సానుభూతితో వినగలుగుతున్నాం.

తెలుగు సాహిత్యంలో వివిధ భావకోవలకు చెందిన కవులు ఒకే వేదికపై చేరే అవకాశం తక్కువవుతున్న రోజుల్లో అందరూ కగలసిపోగల సహృదయ వేదికను కవిలోకానికి సమర్పించింది "నెలనెలా వెన్నెల". విమర్శ జరిగినా అది సహృద్భావ వాతావరణంలోనే. ఒక్కోనెల ఒక్కోమిత్రుడు సమావేశానికి ఆతిధ్యమిచ్చే సంప్రదాయం ఉంది. కనుక కవిమిత్రుల మధ్య వారి కుటుంబాల మధ్య ఎంతో స్నేహం, ఆప్యాయత ఏర్పడుతున్నాయి.

నెలనెలా వెన్నెల నిర్వహించిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి:
1985లో నెలనెలా వెన్నెలలో పాల్గొంటున్న కవిమిత్రుల కవితా సంకలనం ఒకటి వెలువరించాం. నెలనెలావెన్నెల సమావేశాల్లో మన జంటనగరాలలోని 250 మంది ఒకనెల కాకపోతే మరో నెలయినా వచ్చి కూర్చున్నవారే.

నిరుడు (1989) జూలై 31 'కవితా శిబిరం' ఒకటి నిర్వహించుకొన్నాం. ఆధునిక వచన, పద్యధుగేయ కవితలగురించి అధ్యయనం జరిగింది. సభ ఉదయం 11గంటలకు మదలై రాత్రి 10.30 గంటలకు ముగిసింది. ఇంతసేపూ చాలా ఆసక్తితో అందరూ పాల్గొన్నారు.

సంవత్సరం జూన్‌ 24 ఒక కవిసమయం కార్యక్రమం నిర్వహించుకొన్నాం. ప్రయోగంలో 21 మంది కవిమిత్రుల కవితలను వారి వారి పేర్లు లేకుండా ప్రచురించి, కవితలను విశ్లేషించవలసిందిగా ఆహుతులైన సబ్యులను ఆహ్వానించాము. కవి తాను అజ్ఞాతంగా ఉండి తన కవితగురించిన చర్చ చెవులారా వినగలగటమే ఆనాటి సవివరమైన చర్చల ఫలితం. ప్రయోగం మంచి ప్రయోజనమైనదిగా సాహిత్యభిమానులు ప్రశంసించారు.

ఇప్పుడు వెలువరిస్తున్న రెండవ సంకలనంలో కవితలు 40కి మించి ఉన్నాయి. వీటిలో సామాజిక స్పృహలూ, నిస్పృహలూ, రసాలూ, నీరసాలూ అన్నీవున్నాయి.

ఇదొక అవిరళమైన కృషిలో భాగంగానే స్వీకరించండి. కృషి మరింత నైపుణ్యం కోసం వెతుకులాట మాత్రమే.

సంకలనంలోని కవితల్లో ఏక సూత్రతలేదు. అయితే వివిధ భావాలూ, తత్వాలూ, వాదాలకు చెందిన కవిమిత్రుల ప్రతిభకు, పోకడలకూ అద్దంపడతాయి. లబ్ద ప్రతిష్టులు సాహితీ క్షేత్రంలో కొత్తగా నాగాలిపట్టిన కృషీవలులూ ఇందులో దర్శనమిస్తారు. కాని అన్ని కవితలలోనూ సామాన్య లక్షణం భావుకతా, నిజాయితీ.

-------------------------
సివి.కృష్ణారావు, 25 నవంబరు 1990. .......౬౦౯ దీనిలోని కవితలను విలువెంబడి పోస్టు చేస్తాము.
0 కామెంట్‌లు