RSS

గోల్డ్ న్ ధెష్రోల్డ్ - కవిసంగమం కవిత్వం పండుగ



నిన్న గోల్డ్ న్ ధెష్రోల్డ్ లో కవిసంగమం కవిత్వం పండుగ జరిగింది.

ప్రముఖ కవులందరు కవిత్వంతో కవిత్వానికి జైహో అనిపించారు,  


అన్నిటికన్న ముఖ్యంగా నన్ను ఆకర్షించింది రైయిన్ బో హోం మేడి బావి చిన్నారులు,ప్రముఖ కవయిత్రి విమలగారి సలహతో పుస్తకాలు ఆవిష్కరిండం,కవితలు రాయడం బొమ్మలు వేయడం కవిత్వానికి ఇంతకన్నా పండుగ ఏముంది అనిపించింది, అచిన్నారులు శ్రద్ధగా ఓ పక్కగా కూర్చుని అందరికవిత్వం విన్నారు, వీళ్ళనుంచి నేర్చుకోవలసింది చాలా వుంది అనిపించింది,ప్రముఖ కవి శివారేడ్డిగారు అన్నట్లు ...అందరి దగ్గరనుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి జీవితంలో నేర్చుకోవడానికి ఏమి లేకపోతే ఖాళిగా మిగిపోతామేమో?
 

గుజరాత్ దగ్గరనుంచి భారతదేశంలో ఏమూల నుంచి కవిత్వాన్ని అర్దం చేసుకున్నా కవిత్వాని ఒకటే భాష మనసుపోరలలోనుంచీ మాట్లాడం, కవిని కలుసుకుని కవిత్వంతో మాట్లాడుకుందాం

 ప్రో.శీతాంషు యశశ్చంద్ర గారితోమాట్లాడినప్పుడు కూడా ఇలాగే అనిపించింది
 
భాషఏదైనా భావం ఒక్కటే కవిత్వం,కవిత్వం..

నేలమీద కాలు ఆనితేనే భూమితడి ,నేలపగుళ్ళు,తెలుస్తాయి గోరటివెంకన్న గారి దగ్గరనుంచి పల్లే మట్టి వాసనని అనుభవించిన నిన్నటి సాయంకాలం ఓ అద్భుతం పాటలు పల్లేని మోసుకొచ్చాయి ఎన్ని సార్లు విన్న కొత్తగా మళ్ళీ వినాలనిపించేఆపాటలకి
మళ్ళీ మరోసారి కవిత్వానికి జైహో....                


       
.రేణుక అయోల 

1 కామెంట్‌లు