RSS

ఫిఎరి అండ్ ఇఎర్కె


C. V. Krishna Rao (born 1926) is a career social worker who retired as Director Backward Classes Welfare in Government of Andhra Pradesh. He is a poet, short-story writer and literary critic who wrote many a critical essay and assessment. He published four collection of poems. Vytarini deals with slums and lives of slum dwellers, Maadee mee voore with class distinctions and rifts and Avisrantam with the and rifts and Avisrantam with the leftovers of pristine of man. Killari unveils an imaginative artist’s perception of the devastation wrought by nature’s fury manifest in an earthquake. He founded the forum of poets “Nelanelavennela” of Hyderabad

0 కామెంట్‌లు

ఒక లక్ష బొటమన వేళ్ళు చదివినవాడు


కవి దేవతలను ఆవాహన చెయ్యగలడు, కాని విపత్తుయెదుట మూగబోతాడు. వీరుడొక్కడే విపత్తుని ఎదుర్కోగలవాడు. దానితో ముఖాముఖీ, బాహా బాహీ తలపడగలవాడు. కనుకనే భౌతిక విపత్తులు, ఆకలి, కరువు, యుద్ధం, ఉప్పెన, తుఫాను, అశనిపాతం సంభవించిన ఏ సందర్భంలోనయినా ముందు వీరులు పుడతారు. ఆ తరువాతే ఆ వీరుల్నిదేవతలుగా స్తుతిస్తూ కవులు పుట్టేది.
ఇందుకేమైనా మినహాయింపు ఉందా అంటే ఉందనాలి. వీరుల్లాంటి కవులూ, కవుల్లాంటి యోధులూ ఎక్కడయినా ప్రభవిస్తారా అంటే ప్రభవిస్తారనే అనాలి. ఎక్కడిదాకానో ఎందుకు మన గరిమెళ్ళ సత్యనారాయణ, సుద్దాల హనుమంతు, సుబ్బారావు పాణిగ్రాహి, చెరబండరాజు, శివసాగర్‌, గద్దర్‌, ఇప్పుడు దామూ - మనది ధన్యభూమి కనుక ఈ కోవకి అంతంలేదు.
ప్రజాకవులొక్కరే విపత్తు జుట్టు పట్టుకొని దాని మెడలు ఒంగదీసి "కురువృద్దుల్‌, కురుబాంధవుల్‌ చూచుచుండగ" ఎలుగెత్తి తమ శాపాల్నీ, శపథాల్నీ కుమ్మరించగలరు. ప్రజాకవిత వీరకవితా సంప్రదాయం - దాన్ని పాటకో, పదానికో పరిమితంచెయ్యలేం. ఈ చిన్ని సంపుటంలోని వచనాల్ని చదివిన వారికి ఈ విషయమే బోధపడుతుంది. అజ్ఞాతుడయిన ఏ రాయలసీమ ప్రజాకవి వీరుడో ఎన్నడో 'ధాతకరువు'పైని పాడిన విషాదభరిత గీతాన్నొకసారి ఆమళ్ళదిన్నె గోపీనాథ్‌ గారు వినిపించగా విన్నాను. ఆనాడు నే పొందిన బాధామయస్పురణని తిరిగి ఈ కవితల్లో కన్నాను.
చాలా యేళ్ళ కిందట తన గురించి కృష్ణారావు గారు ఇలా రాసుకున్నారు.
"వాళ్ళు .... గుడిశముందు మురికి గుంటల ఒడ్డున నులకమంచం కోడు పొందించి దగ్గరకు రావచ్చునో లేదో అనే భయభ్రాంతి పొడుస్తుంటే సగంచెప్పి సగంచెప్పక పూర్తిగా బాధ చెప్పటానికి మాటలురాక అర్జీ రాసికోవటానికి యిళ్ళల్లో కాగితంలేక చేతుల్లో కలాలు లేక ఏకలవ్యుల్లా నాకు వారి బొటిమన వేళ్ళీచ్చారు. ఒక లక్ష బొటిమన వేళ్ళూ నేను వ్రాసాను - చదివాను. ముదుసళ్ళవీ, వయస్కులవీ, స్త్రీలవీ, పురుషలవీ, ఆరోగ్యవంతులవీ, పాపలవీ, వీరులవీ .... (వైతరణి - 1968)"
శిష్ట సంప్రదాయానికి చెందిన కవి పూర్వకవి సమయాలను బాగా అధ్యయనం చేస్తాడు. కానీ ప్రజాసంప్రదాయానికి చెందిన కవి లక్ష బొటిమన వేళ్ళను చదువుతుంటాడు, పోల్చుకుంటాడు. కృష్ణారావుగారు వచన మార్గానికి చెందిన ప్రజాకవి. ఎన్నో రోజులుగా ఈ కవితల్తో నేను కలిసి గడిపిన మీదట ఇప్పుడు చెప్పగలిగింది ఇదే. బాదా సందర్బాన్ని మనం మర్చిపోవాలనుకుంటాం. కానీ కవి గుర్తుచేస్తాడు. మనవంటి మందమతులకి తిరిగి తిరిగి గుర్తుచేసే ఈ బాధ్యతని నెత్తికెత్తుకున్నందుకు కవిది నిత్య బాధా సందర్బం. మన బాధా, తన బాధా అందరి బాధా తనే పడుతున్న తల్లిలాంటి, భూమిలాంటి కవి మన ముందుకు వచ్చినపుడు ఇకనైనా జాగు చెయ్యక వెంటనే పోల్చుకుందాం.
వాడ్రేవు చినవీరభద్రుడు.
హైదరాబాదు, 18.7.1996
-----
1993 సెప్టెంబరు 30వతేదీ రాత్రి లాతూర్‌, ఉస్మానాబాద్‌(మహారాష్ట్ర) జిల్లాల 69 గ్రమాల్లో భయంకరంగా భూమి కంపించిన సందర్భంలో కవిగా స్పందించి, ప్రదేశాలను దర్శించి, అక్షరీకరించి "కిల్లారి" పేరిట 1996లో మనముందుకొచ్చింది. 1 కామెంట్‌లు

ఫిబ్రవరి ౨౦౧౦ నెల నెలా వెన్నెల

2 కామెంట్‌లు

నెలనెలావెన్నెల సమావేశాలు photos




 
Posted by Picasa

శ్రీ ధర్మాచారి, శ్రీ అద్దేపల్లి, శ్రీమతి శిలాలోలిత
శ్రీ సి.వి.కృష్ణారావు, శ్రీ ప్రసాద్, శ్రీ ఒబ్బిని 6 కామెంట్‌లు

సమావేశాలు



0 కామెంట్‌లు

డాక్టర్ రామినేని ఫౌండేషన్ వారి 2003 పురస్కారలు




0 కామెంట్‌లు

జనవరి నెల సమావేశ విశేషాలు

31.1.2010 ఆదివారము సాయంత్రం జరిగింది
హాజరైన వారు
శ్రీ ఒబ్బిని సన్యాసిరావు
శ్రీ ధర్మాచారి
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీమతి దావులూరి విజయలక్ష్మి
శ్రీమతి రేణుకా అయోలా
శ్రీమతి శిలాలోలిత
శ్రీ యాకూబ్
శ్రీమతి పార్వతీ మోహన్

స్వీయ కవితా పఠనము ఓబ్బిని తో మొదలయ్యి, ధర్మాచారి గల్పికలు, శిలాలోలిత, రేణుకా అయోలా, జాన్ హైడ్ కనుమూరి కవిత్వాన్ని చదివారు.
యాకూబ్ తన కొత్త సంపుటినుండి కొన్ని కవితలను వినిపించి అందరికి అందజేసారు.
డావులూరి విజయలక్ష్మి తన కథల పుస్తకాన్ని అందించారు.
నెల నెలా వెన్నెల ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను, విశేషాలను ఉటంకిస్తూ పార్వతీ మోహన్ రాసిన వ్యాసాన్ని, యాకూబ్ చదివి వినిపించారు. అది త్వరలో బ్లాగులో రానుంది మరిఉ సంకలనంలో రానుంది. ఆ వ్యాసంలోని పలువురు వ్యక్తుల పేర్లు వింటున్నప్పుడు వారిగురించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు కొందరు. కోదరు మన మద్యలేరు అనే జ్ఞప్తి కొచెం బాదించినా వ్యాసంగా రావటం సాహిత్య నికి అవసరం ఎంతానావుందని అందరూ అభిప్రాయపడ్డారు.
నెలనెలా వెన్నెల అనేక సాయంకాలల పేరుతో ఇప్పటివర్కూ నాలుగు సంకలనాలు వెలువడ్డాయి. ఐదవ సంకలనకోసం చేస్తున్న ప్రయత్నాలగురించి చర్చించారు.
యాకూబ్ తనవంతు సహకారాన్నివ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకు వచ్చిన కవితలను, ఇంకా రావలసిన వాటికోసం మిత్రులతో మాట్లాడలని అనుకున్నారు.
బ్లాగు విషయాలను జాన్ హైడ్ తనవంతు సహకారాన్ని ఇవ్వడంకోసం ముందుంటానన్నారు. 2 కామెంట్‌లు